** తాజా వార్తలు : 11న కలెక్టరేట్ల ముట్టడి: టీఆర్‌ఎస్‌వీ ** తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు దారుణం: ఎర్రన్నాయుడు, ముఖ్యనగరాల్లో కాంగ్రెస్‌ పార్టీ 125వ వార్షికోత్సవ కార్యక్రమాలు ** బోడోలాండ్‌ తీవ్రవాదుల కాల్పులు: 12 మంది మృతి ** బలహీనపడి... కర్ణాటకకు తరలిన జల్‌ తుపాను ** గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే సూపర్‌పవర్‌ కల నెరవేరదు: జేపీ ** విశాఖపట్నం: ఉద్యోగం రాలేదని మునగపాకకు చెందిన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు** విశాఖపట్నం: జిల్లాలో వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.4500 చొప్పున పరిహారం ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు కలెక్టరు శ్యామలరావు చెప్పారు**
Loading...

జల్‌' తుపాను తీవ్రత తగ్గే అవకాశం

విశాఖ : ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'జల్‌' తుపాను తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీవ్ర తుపాను దశ నుంచి ఇది తుపానుగా మారే సూచనలు కన్పిస్తున్నట్లు వెల్లడించారు. మరో రెండు, మూడు గంటల్లో దీని తీవ్రత తగ్గుముఖం పడుతుందని, కోస్తాంధ్ర తీరం వెంబడి గాలుల వేగం, సముద్రంలో అలల తీవ్రత తగ్గుతుందన్నారు. ప్రస్తుతం చెన్నైకి 250, నెల్లూరుకు 350 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఈ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ కోస్తాంధ్ర వైపు కదులుతోందని, ఇది ఈరోజు రాత్రి నెల్లూరు-చెన్నై మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పలు చోట్ల అతిభారీ వర్షాలు, తెలంగాణలో జల్లులు, ఉత్తర కోస్తాలో మోస్తరుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.