** తాజా వార్తలు : 11న కలెక్టరేట్ల ముట్టడి: టీఆర్‌ఎస్‌వీ ** తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు దారుణం: ఎర్రన్నాయుడు, ముఖ్యనగరాల్లో కాంగ్రెస్‌ పార్టీ 125వ వార్షికోత్సవ కార్యక్రమాలు ** బోడోలాండ్‌ తీవ్రవాదుల కాల్పులు: 12 మంది మృతి ** బలహీనపడి... కర్ణాటకకు తరలిన జల్‌ తుపాను ** గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే సూపర్‌పవర్‌ కల నెరవేరదు: జేపీ ** విశాఖపట్నం: ఉద్యోగం రాలేదని మునగపాకకు చెందిన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు** విశాఖపట్నం: జిల్లాలో వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.4500 చొప్పున పరిహారం ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు కలెక్టరు శ్యామలరావు చెప్పారు**
Loading...

చోడవరం చక్కెర ఫ్యాక్టరీకి అవార్డు

న్యూఢిల్లీ: ఆర్థిక యాజమాన్య నిర్వహణలో చూపిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా విశాఖజిల్లా చోడవరం సహకార చక్కెర కర్మాగారానికి జాతీయస్థాయిలో రెండో బహుమతి లభించింది. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో జాతీయ సహకార చక్కెర కర్మాగారాల సమాఖ్య ఈ అవార్డును అందించింది. కేంద్ర మంత్రి శరద్‌పవార్‌, భారీపరిశ్రమల శాఖా మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ల నుంచి రాష్ట్ర చెరకు, చక్కెరశాఖ కమిషనర్‌ కె.లక్ష్మినారాయణ, చోడవరం చక్కెర కర్మాగారం మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.వి.రామయ్యలు ఈ 'ఫైనాన్షియల్‌ మేనేజమెంట్‌ అవార్డు' అందుకున్నారు.