** తాజా వార్తలు : 11న కలెక్టరేట్ల ముట్టడి: టీఆర్‌ఎస్‌వీ ** తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు దారుణం: ఎర్రన్నాయుడు, ముఖ్యనగరాల్లో కాంగ్రెస్‌ పార్టీ 125వ వార్షికోత్సవ కార్యక్రమాలు ** బోడోలాండ్‌ తీవ్రవాదుల కాల్పులు: 12 మంది మృతి ** బలహీనపడి... కర్ణాటకకు తరలిన జల్‌ తుపాను ** గ్రామీణ భారతాన్ని నిర్లక్ష్యం చేస్తే సూపర్‌పవర్‌ కల నెరవేరదు: జేపీ ** విశాఖపట్నం: ఉద్యోగం రాలేదని మునగపాకకు చెందిన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు** విశాఖపట్నం: జిల్లాలో వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.4500 చొప్పున పరిహారం ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు కలెక్టరు శ్యామలరావు చెప్పారు**
Loading...

వరికి రూ.1,600 మద్దతుధర ఇవ్వాలి

హైదరాబాద్‌: స్వామినాధన్‌ కమిటీ సిఫార్సుల మేరకు వరికి రూ.1,600 మద్దతుధర ఇవ్వాలని తెలుగుదేశం డిమాండ్‌ చేసింది. తడిసిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలని కోరింది. ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడారు. వరికి కనీస మద్దతు ధర రూ.1,030గా ఉంటే, ఆచరణలో రూ.800కి మించి ధర రావటం లేదని అన్నారు.

కిందటేడాది పండించిన ధాన్యమే ఇంకా రైతుల వద్ద ఉందనీ, దానికే మద్దతు ధర దక్కటం లేదని చెప్పారు. శాఖల కేటాయింపు వివాదాల్లో ఉన్న మంత్రులు, ప్రభుత్వం ఇంకా రైతు సమస్యలపై దృష్టి సారించలేదని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని, దీనిపై ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదని ఐకేపీ సంఘాలు చెబుతున్నాయని వెల్లడించారు. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలన్నీ వరి రైతులకు మద్దతు ధరకు అదనంగా ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తుంటే, మనరాష్ట్రంలో అసలు మద్దతు ధరే అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగమతులకు అనుమతి ఇచ్చినందువల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఆయా రాష్ట్రాల్లోనూ పుష్కలంగా కురిసిన వర్షాలతో వరి దిగుబడులు పెరిగాయని వివరించారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో మార్కెట్ల సందర్శన కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.